గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రాన్ని కలిసిన జహీరాబాద్ ఎంపీ
గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రాన్ని కలిసిన జహీరాబాద్ ఎంపీ
Krishna
ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ఇతర ఎంపీలతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై-జీ) కింద 11.56 లక్షల ఇళ్లను తక్షణమే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆవాస్ ప్లస్ సర్వేలో గుర్తించిన అర్హులైన గ్రామీణ పేద కుటుంబాలకు త్వరగా ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగేలా వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్లో అదనపు పనులను చేర్చడంతో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి మెరుగుపడేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పలువురు ఎంపీలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి