చౌటుప్పల్ పురపాలక పరిధిలోని నారాయణ హైస్కూల్లో ఆషాడ బోనాల వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం పాఠశాల ప్రాంగణం నుండి దగ్గర్లోని మైసమ్మ గుడి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల పోతురాజు నృత్యాలు, విన్యాసాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో 'ఈ-చామ్స్' కోఆర్డినేటర్ సునీత, 'ఈ-కిడ్స్' కోఆర్డినేటర్ హర్ష, ఏడీ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం, వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి