పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అతిపెద్ద బహుమతి వారితో గడిపే సమయమేనని ఎస్ఆర్ఎం సంకల్ప్ స్కూల్ చైర్పర్సన్ కేశినేని శ్రీదేవి అన్నారు. శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ‘పేరెంట్,చైల్డ్ ఫన్ స్పోర్ట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించి, మానవ సంబంధాలు, కుటుంబ బంధాల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు.మొబైల్ వ్యసనం నుంచి పిల్లలను బయటపడేసేందుకు ఇటువంటి వినోదాత్మక క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
గెలుపోటముల కంటే పిల్లలతో కలిసి ఆనందంగా గడపడమే ముఖ్యమని, ఈ క్రీడల్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.........

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి