భువనగిరి: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని కార్మికులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి పాండు పిలుపునిచ్చారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాస్తారోకోకు మద్దతుగా భువనగిరి పట్టణ పరిధిలోని రైస్ మిల్లులు, పరిశ్రమల వద్ద హమాలీ కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో కార్మికులు, ప్రజలు తమ హక్కుల కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక చట్టాలు, ప్రజాస్వామ్య హక్కులను నిర్వీర్యం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రజా, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న జైల్ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు నరసింహ, ఐలయ్య, ఆసిఫ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి