Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 09:08 PM

గుంతల రోడ్డుపై వరి నాట్లవేస్తూ బీఆర్ఎస్ వినూత్న నిరసన

గుంతల రోడ్డుపై వరి నాట్లవేస్తూ బీఆర్ఎస్ వినూత్న నిరసన

గుంతల రోడ్డుపై వరి నాట్లవేస్తూ బీఆర్ఎస్ వినూత్న నిరసన
08-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.గుంతలతో చెరువులను తలపిస్తున్న రోడ్డుపై వరి నాట్లు వేసి, గాలాలతో చేపలు పడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు తడకమళ్ల రవికుమార్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో జాజిరెడ్డిగూడెం నుంచి మానాపురం ఎక్స్‌రోడ్డు వరకు రూ.28 కోట్లతో నూతన రహదారి నిర్మాణానికి 2023 నవంబర్‌లో అప్పటి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం ఎమ్మెల్యే మందుల సామేలు కూడా జాజిరెడ్డిగూడెం నుంచి మానాపురం తండా వరకు రోడ్డు నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన చేసి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తికాలేదని ఆరోపించారు.రహదారి మొత్తం గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.రోడ్డు పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించి రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, బొంకూరి మధు, కొండగడుపుల వెంకటేష్, కాసర్ల రాజశేఖర్, తడకమళ్ల మధు, బొంకూరి సాయి, కొండ మధు, కడియం గోపి, కొండగడుపుల నాగరాజు, గడ్డం నితిన్, పవన్, బద్రి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుంతల రోడ్డుపై వరి నాట్లవేస్తూ బీఆర్ఎస్ వినూత్న నిరసన

Article Image

తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.గుంతలతో చెరువులను తలపిస్తున్న రోడ్డుపై వరి నాట్లు వేసి, గాలాలతో చేపలు పడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు తడకమళ్ల రవికుమార్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో జాజిరెడ్డిగూడెం నుంచి మానాపురం ఎక్స్‌రోడ్డు వరకు రూ.28 కోట్లతో నూతన రహదారి నిర్మాణానికి 2023 నవంబర్‌లో అప్పటి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం ఎమ్మెల్యే మందుల సామేలు కూడా జాజిరెడ్డిగూడెం నుంచి మానాపురం తండా వరకు రోడ్డు నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన చేసి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తికాలేదని ఆరోపించారు.రహదారి మొత్తం గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.రోడ్డు పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించి రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, బొంకూరి మధు, కొండగడుపుల వెంకటేష్, కాసర్ల రాజశేఖర్, తడకమళ్ల మధు, బొంకూరి సాయి, కొండ మధు, కడియం గోపి, కొండగడుపుల నాగరాజు, గడ్డం నితిన్, పవన్, బద్రి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News