Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 08:14 PM

గీతన్నల గళం.. బస్సు యాత్ర బలం! రేపు రామన్నపేటకు చైతన్య బస్సు యాత్ర.. భారీగా తరలిరావాలని పిలుపు.

గీతన్నల గళం.. బస్సు యాత్ర బలం! రేపు రామన్నపేటకు చైతన్య బస్సు యాత్ర.. భారీగా తరలిరావాలని పిలుపు.

గీతన్నల గళం.. బస్సు యాత్ర బలం!  రేపు రామన్నపేటకు చైతన్య బస్సు యాత్ర.. భారీగా తరలిరావాలని పిలుపు.
08-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

గీత కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం చేపట్టిన గీతన్నల చైతన్య బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 9న రామన్నపేట మండల కేంద్రానికి చేరుకోనున్న బస్సు యాత్రను విజయవంతం చేయాలని గీత కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

బస్సు యాత్ర సందర్భంగా బోగారం గ్రామంలోని కల్లు గీత కార్మికులతో కలిసి నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వంతో పాటు వివిధ మండలాల నాయకులు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు.

రామన్నపేట మండలం నుంచి మండల నాయకులు, సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గీతన్నల ఐక్యతను చాటేలా యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బావండ్లపల్లి బాలరాజు, మండల అధ్యక్షులు కూనూరు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు మునికుంట్ల లెనిన్, అంతటి దశరథ, చెరుకు సత్తయ్య, జయమ్మ, చెరుకు నర్సింహా, కూనూరు శంకరయ్య, కూనూరు బక్కులు, కూనూరు రాములు తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

గీతన్నల గళం.. బస్సు యాత్ర బలం! రేపు రామన్నపేటకు చైతన్య బస్సు యాత్ర.. భారీగా తరలిరావాలని పిలుపు.

Article Image

రామన్నపేట

గీత కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం చేపట్టిన గీతన్నల చైతన్య బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 9న రామన్నపేట మండల కేంద్రానికి చేరుకోనున్న బస్సు యాత్రను విజయవంతం చేయాలని గీత కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

బస్సు యాత్ర సందర్భంగా బోగారం గ్రామంలోని కల్లు గీత కార్మికులతో కలిసి నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వంతో పాటు వివిధ మండలాల నాయకులు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు.

రామన్నపేట మండలం నుంచి మండల నాయకులు, సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గీతన్నల ఐక్యతను చాటేలా యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బావండ్లపల్లి బాలరాజు, మండల అధ్యక్షులు కూనూరు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు మునికుంట్ల లెనిన్, అంతటి దశరథ, చెరుకు సత్తయ్య, జయమ్మ, చెరుకు నర్సింహా, కూనూరు శంకరయ్య, కూనూరు బక్కులు, కూనూరు రాములు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News