రామన్నపేట
గీత కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం చేపట్టిన గీతన్నల చైతన్య బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 9న రామన్నపేట మండల కేంద్రానికి చేరుకోనున్న బస్సు యాత్రను విజయవంతం చేయాలని గీత కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
బస్సు యాత్ర సందర్భంగా బోగారం గ్రామంలోని కల్లు గీత కార్మికులతో కలిసి నాయకులు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వంతో పాటు వివిధ మండలాల నాయకులు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు.
రామన్నపేట మండలం నుంచి మండల నాయకులు, సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గీతన్నల ఐక్యతను చాటేలా యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బావండ్లపల్లి బాలరాజు, మండల అధ్యక్షులు కూనూరు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు మునికుంట్ల లెనిన్, అంతటి దశరథ, చెరుకు సత్తయ్య, జయమ్మ, చెరుకు నర్సింహా, కూనూరు శంకరయ్య, కూనూరు బక్కులు, కూనూరు రాములు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి