సరూర్నగర్: పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులుగా ఉంటున్న పురుషులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు సరూర్నగర్లో షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ (ఎస్యూహెచ్) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్నగర్ సర్కిల్-12 వార్డు కార్యాలయ భవనాన్ని ఇందుకోసం ఎంపిక చేసినట్లు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు.
నిరాశ్రయులను గుర్తించి వారికి తాత్కాలిక వసతి కల్పించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన సహాయం అందించి సొంత ప్రాంతాలకు పంపించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) తమ కార్యాలయంలో సంప్రదించాలని డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి