తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శెట్టి అశోక్, జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ ఆదేశాల మేరకు శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జిల్లా అధ్యక్షులు బస్వరాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, జాతీయ ప్రచార కార్యదర్శి కర్చల సంగమేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి నాగేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మన్నే పోచయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆందోల్ ప్రాంతానికి చెందిన జె. రాజును సంగారెడ్డి జిల్లా ముఖ్య సలహాదారుగా, డి. సుకుమార్, బి. బాలరాజ్లను సంగారెడ్డి జిల్లా సభ్యులుగా, ఎస్. యాదయ్యను ఆందోల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమించారు. నూతనంగా నియమితులైన పదాధికారులకు జోగిపేట ఏఎస్ఐ దుర్గయ్య చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. నూతన పదాధికారులు తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తూ, సంఘం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో నూతన నియామకాలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో నూతన నియామకాలు
Krishna
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శెట్టి అశోక్, జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ ఆదేశాల మేరకు శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జిల్లా అధ్యక్షులు బస్వరాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, జాతీయ ప్రచార కార్యదర్శి కర్చల సంగమేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి నాగేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మన్నే పోచయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆందోల్ ప్రాంతానికి చెందిన జె. రాజును సంగారెడ్డి జిల్లా ముఖ్య సలహాదారుగా, డి. సుకుమార్, బి. బాలరాజ్లను సంగారెడ్డి జిల్లా సభ్యులుగా, ఎస్. యాదయ్యను ఆందోల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమించారు. నూతనంగా నియమితులైన పదాధికారులకు జోగిపేట ఏఎస్ఐ దుర్గయ్య చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. నూతన పదాధికారులు తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తూ, సంఘం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి