Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేలపట్ల చేనేత సొసైటీ ఛైర్మన్ ఎన్నికపై ‘స్టే’ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 10:22 PM

నేలపట్ల చేనేత సొసైటీ ఛైర్మన్ ఎన్నికపై ‘స్టే’

నేలపట్ల చేనేత సొసైటీ ఛైర్మన్ ఎన్నికపై ‘స్టే’

నేలపట్ల చేనేత సొసైటీ ఛైర్మన్ ఎన్నికపై ‘స్టే’
08-08-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ముగ్గురు పిల్లల నిబంధన ఉల్లంఘన.. తెలంగాణ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు

నేలపట్ల చేనేత సహకార సంఘం నూతన ఛైర్మన్ ఎన్నిక వివాదంలో తెలంగాణ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. ముగ్గురు పిల్లలున్న విషయాన్ని దాచి నిబంధనలకు విరుద్ధంగా పోటీ చేసిన ఛైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాసులు ఎన్నికపై ‘స్టే’ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ​జులై 10న జరిగిన సొసైటీ ఎన్నికల్లో స్థానిక పద్మశాలి కుల సంఘం ప్యానెల్ 6 స్థానాలు, శ్రీనివాస్ ప్యానెల్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, కుల సంఘం ప్యానెల్ నుంచి ఇద్దరు డైరెక్టర్లను తనవైపు తిప్పుకుని శ్రీనివాస్ అక్రమంగా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.ఉమ్మడి రాష్ట్ర కో-ఆపరేటివ్ చట్టం ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులు.ఈ నిబంధన ఆధారంగా కుల సంఘం డైరెక్టర్లు—తడక పారిజాత, పిల్లలమర్రి కిరణ్, గంజి శ్రీనివాసు, తడక కోటేశ్వర్—ఆగస్టు 5న కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్, శ్రీనివాస్‌కు ముగ్గురు సంతానం ఉన్నట్లు నిర్ధారించి ఛైర్మన్, డైరెక్టర్ ఎన్నికలపై ఆగస్టు 5 నుంచే అమలులోకి వచ్చేలా స్టే విధించింది. ఈ ఉత్తర్వుల కాపీని ప్రతినిధులు యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత ఏడీ కి అందజేశారు.

Sthanikam

నేలపట్ల చేనేత సొసైటీ ఛైర్మన్ ఎన్నికపై ‘స్టే’

Article Image

ముగ్గురు పిల్లల నిబంధన ఉల్లంఘన.. తెలంగాణ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు

నేలపట్ల చేనేత సహకార సంఘం నూతన ఛైర్మన్ ఎన్నిక వివాదంలో తెలంగాణ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. ముగ్గురు పిల్లలున్న విషయాన్ని దాచి నిబంధనలకు విరుద్ధంగా పోటీ చేసిన ఛైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాసులు ఎన్నికపై ‘స్టే’ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ​జులై 10న జరిగిన సొసైటీ ఎన్నికల్లో స్థానిక పద్మశాలి కుల సంఘం ప్యానెల్ 6 స్థానాలు, శ్రీనివాస్ ప్యానెల్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, కుల సంఘం ప్యానెల్ నుంచి ఇద్దరు డైరెక్టర్లను తనవైపు తిప్పుకుని శ్రీనివాస్ అక్రమంగా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.ఉమ్మడి రాష్ట్ర కో-ఆపరేటివ్ చట్టం ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులు.ఈ నిబంధన ఆధారంగా కుల సంఘం డైరెక్టర్లు—తడక పారిజాత, పిల్లలమర్రి కిరణ్, గంజి శ్రీనివాసు, తడక కోటేశ్వర్—ఆగస్టు 5న కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్, శ్రీనివాస్‌కు ముగ్గురు సంతానం ఉన్నట్లు నిర్ధారించి ఛైర్మన్, డైరెక్టర్ ఎన్నికలపై ఆగస్టు 5 నుంచే అమలులోకి వచ్చేలా స్టే విధించింది. ఈ ఉత్తర్వుల కాపీని ప్రతినిధులు యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత ఏడీ కి అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News