ముగ్గురు పిల్లల నిబంధన ఉల్లంఘన.. తెలంగాణ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు
నేలపట్ల చేనేత సహకార సంఘం నూతన ఛైర్మన్ ఎన్నిక వివాదంలో తెలంగాణ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. ముగ్గురు పిల్లలున్న విషయాన్ని దాచి నిబంధనలకు విరుద్ధంగా పోటీ చేసిన ఛైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాసులు ఎన్నికపై ‘స్టే’ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జులై 10న జరిగిన సొసైటీ ఎన్నికల్లో స్థానిక పద్మశాలి కుల సంఘం ప్యానెల్ 6 స్థానాలు, శ్రీనివాస్ ప్యానెల్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, కుల సంఘం ప్యానెల్ నుంచి ఇద్దరు డైరెక్టర్లను తనవైపు తిప్పుకుని శ్రీనివాస్ అక్రమంగా ఛైర్మన్గా ఎన్నికయ్యారు.ఉమ్మడి రాష్ట్ర కో-ఆపరేటివ్ చట్టం ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులు.ఈ నిబంధన ఆధారంగా కుల సంఘం డైరెక్టర్లు—తడక పారిజాత, పిల్లలమర్రి కిరణ్, గంజి శ్రీనివాసు, తడక కోటేశ్వర్—ఆగస్టు 5న కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన ట్రిబ్యునల్, శ్రీనివాస్కు ముగ్గురు సంతానం ఉన్నట్లు నిర్ధారించి ఛైర్మన్, డైరెక్టర్ ఎన్నికలపై ఆగస్టు 5 నుంచే అమలులోకి వచ్చేలా స్టే విధించింది. ఈ ఉత్తర్వుల కాపీని ప్రతినిధులు యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత ఏడీ కి అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి