యుగతులసి గోశాల నుంచి ఉచితంగా ఆవుల పంపిణీ
గోమాతకు గోశాలల కంటే రైతుల వద్దే పూర్తి సురక్షితమైన వాతావరణం లభిస్తుందని బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ గోగు రవి అన్నారు. యుగతులసి గోశాల సౌజన్యంతో, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక రైతులకు ఉచితంగా గోవులను అందజేశారు.ఈ సందర్భంగా గోగు రవి మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో గోవు ఉండటం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా, వ్యవసాయానికి కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల వద్ద గోవులు ఉన్నప్పుడే గోమాత విశిష్టత, పవిత్రత సమాజానికి మరింత స్పష్టంగా తెలుస్తాయని ఆయన తెలిపారు. గోవులను కేవలం గోశాలలకే పరిమితం చేయకుండా, ప్రతీ రైతు తమ స్వంత కుటుంబ సభ్యురాలిగా భావించి పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి