అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవం
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ నూతన పాలకమండలిని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ కరీంకొండ స్వప్న అశోక్, ఉప సర్పంచ్ జెల్ల పవన్, రామాలయం చైర్మన్ మాచర్ల సంతోష్ కుమార్ల అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక చేపట్టారు.ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ నూతన అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఏలే మురళి, సూరకంటి మోహన్ రెడ్డి, కొయ్యడ స్వామి గౌడ్, అల్మాస్పేట గౌతమ్, రాసాల నర్సింహా, దికొండ ఉదయ్ కిరణ్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... భక్తుల సహకారంతో దేవాలయ ప్రతిష్ఠను పెంపొందిస్తూ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను గ్రామ పెద్దలు, భక్తులు అభినందించారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి