కూసుమంచి గ్రామాల్లో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఏసీపీ తిరుపతిరావు అన్నారు. కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు జరగకుండా అడ్డుకోవడంతో పాటు, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గ్రామ ప్రజలు భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఏసీపీ తిరుపతిరావు సన్మానించారు. కార్యక్రమంలో సీఐ సందీప్, ఎస్సై నాగరాజు, సర్పంచ్ సరిత–లింగయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.













































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి