Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గిరిజన గురుకుల పాఠశాలలో 4 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ.. అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 09:08 PM

గ్రామాభివృద్ధికి సీసీ కెమెరాలు దోహదం

గ్రామాభివృద్ధికి సీసీ కెమెరాలు దోహదం

గ్రామాభివృద్ధికి సీసీ కెమెరాలు దోహదం
09-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కూసుమంచి గ్రామాల్లో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఏసీపీ తిరుపతిరావు అన్నారు. కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు జరగకుండా అడ్డుకోవడంతో పాటు, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గ్రామ ప్రజలు భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఏసీపీ తిరుపతిరావు సన్మానించారు. కార్యక్రమంలో సీఐ సందీప్, ఎస్సై నాగరాజు, సర్పంచ్ సరిత–లింగయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాభివృద్ధికి సీసీ కెమెరాలు దోహదం

Article Image

కూసుమంచి గ్రామాల్లో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఏసీపీ తిరుపతిరావు అన్నారు. కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు జరగకుండా అడ్డుకోవడంతో పాటు, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గ్రామ ప్రజలు భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఏసీపీ తిరుపతిరావు సన్మానించారు. కార్యక్రమంలో సీఐ సందీప్, ఎస్సై నాగరాజు, సర్పంచ్ సరిత–లింగయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News