వనస్థలిపురం: చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన పెద్ది శంకర్ గౌడ్.. నేడు అనాథలు, వృద్ధులకు ఆపద్బాంధవుడిగా మారారు. కన్నబిడ్డలు పట్టించుకోని వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. ‘రెడీ టూ సర్వ్ ఫౌండేషన్’ ద్వారా ఉచిత వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ పెద్ద కొడుకుగా అండగా నిలుస్తున్నారు.
15 ఏళ్లుగా సేవా బాటలో..
ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే పేద రోగులు, అన్నార్తులకు ప్రతి ఆదివారం అన్నదానం చేస్తున్నారు. తొలుత 50 మందితో ప్రారంభమైన ఈ సేవ ప్రస్తుతం 200–300 మందికి చేరింది. వనస్థలిపురం, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్జే, బసవతారకం తదితర ఆస్పత్రుల వద్ద అన్నదానం కొనసాగుతోంది. వృద్ధాశ్రమంలో వసతి సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి ఆశ్రమ నిర్మాణానికి స్థలం కోసం శంకర్ గౌడ్ దాతల సహకారం కోరుతున్నారు. ఒక్క చదరపు అడుగుకు రూ.3,500 చొప్పున సాయం చేయాలని, 9701295527 నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పావలా శ్యామలకు అండగా..
అనారోగ్యంతో బాధపడిన సీనియర్ నటి పావలా శ్యామలకు తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించిన శంకర్ గౌడ్.. ఆమె కుమార్తె మాధవికి కూడా అండగా నిలిచారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆశ్రమంలోని వృద్ధులకు నటించే అవకాశం లభించడంతో పాటు సినిమా బృందం విరాళం అందించింది. మెగాస్టార్ చిరంజీవి రూ.లక్ష, గీతా భాస్కర్ రూ.50 వేల సాయం చేశారు. ఆగస్టు 10న శంకర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయన సేవలను అభినందిస్తూ ఆశీర్వదిద్దాం.













































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి