కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చకీలం రాజేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి విజయానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు పార్టీలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగుల వాసు, బానోత్ సైదులు, కాంగ్రెస్ నాయకులు చింతమల్ల రమేష్, జానయ్య, నరేందర్నాయుడు, సాయి నేత, నారాయణ, మాధవరెడ్డి, సమీర్, అనిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి