రామన్నపేట
రైతులకు నాణ్యమైన విద్యుత్ను 24 గంటలు అందించాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు 24 గంటల త్రీఫేస్ విద్యుత్ అందడం లేదని, కేవలం సుమారు 10 గంటలపాటు మాత్రమే సరఫరా చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. తరచూ లో-వోల్టేజీ సమస్యలు తలెత్తడంతో స్టార్టర్లు, మోటార్లు కాలిపోయి రైతులకు ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించి, నాణ్యమైన విద్యుత్తోపాటు సరిపడా త్రీఫేస్ కరెంట్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బందెల రాములు పోషబోయిన మల్లేశం సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్ గర్దాస్ విక్రమ్ మాజీ ఎంపీటీసీలు సర్పంచులు రేఖ యాదయ్య పున్న వెంకటేశం ఎండి అమీర్ జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం బద్దుల రమేష్ పట్టణ కార్యదర్శి జాడ సంతోష్ నాయకులు మెట్టు శ్రీనివాస్ రెడ్డి కోనూరు ముత్తయ్య కోళ్ల కిషన్ ఆవుల నరేందర్ చిన్నపాక శ్రీనివాస్ బొడ్డు అల్లయ్య చొప్పరి నరసింహ తాళ్ల క్రాంతి కుమార్ బండ శ్రీనివాస్ రెడ్డి మామిళ్ల అశోక్ గంగుల రాఘవరెడ్డి నక్క నరేందర్ బుర్ర శ్రీశైలం ఎండి అజాజ్ ఖాన్ ఆవుల శ్రీధర్ బొడ్డుపల్లి రాజు గర్దాస్ కరుణాకర్ వంగాల యాదయ్య జెల్ల శ్రీను కందగట్ల శ్రీను మామిళ్ళ కుమార్ మామిడి పద్మా రెడ్డి మేడి కృష్ణ కోనూరు ఆంజనేయులు అంతటి మల్లేశం నీరుడు కల్లూరి నరేష్ సురేష్ గోవు రమేష్ గణేష్ కొమ్మ గోని రమేష్ గర్దా శ్రీకాంత్ సంగిశెట్టి శివాజీ ఎండి ఆరిఫ్ బిక్షం ఐలయ్య పాపయ్య అంజయ్య యాదయ్య ముత్తయ్య తదితరులు పాల్గొనడం జరిగింది














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి