పేదరికం ఉన్నత చదువులకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి శ్రీకాకోళ్లపు చలపతిరావు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సదన్ అపార్ట్మెంట్లో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం ఆధ్వర్యంలో ముగ్గురు పేద ఆర్యవైశ్య విద్యార్థులకు చలపతిరావు, సులోచన దంపతులు రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న బుస్సా జ్ఞానసాయికి రూ.15 వేలు, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వీర్లపాటి జయశ్రీకి రూ.10 వేలు, రాచూరి సహస్రకు రూ.5 వేలు అందించారు. కార్యక్రమంలో శ్రీకాకోళ్లపు రాఘవేంద్ర, భవాని, సింగిరికొండ సుకుమార్, శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, వెంకటరమణ, విద్యార్థుల కుటుంబ సభ్యులు బుస్సా వీరకుమార్, రాచూరి పూర్ణచందర్, వీర్లపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.













































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి