Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గిరిజన గురుకుల పాఠశాలలో 4 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ.. అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 09:10 PM

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత
09-08-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


పేదరికం ఉన్నత చదువులకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి శ్రీకాకోళ్లపు చలపతిరావు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సదన్‌ అపార్ట్‌మెంట్‌లో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం ఆధ్వర్యంలో ముగ్గురు పేద ఆర్యవైశ్య విద్యార్థులకు చలపతిరావు, సులోచన దంపతులు రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న బుస్సా జ్ఞానసాయికి రూ.15 వేలు, ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న వీర్లపాటి జయశ్రీకి రూ.10 వేలు, రాచూరి సహస్రకు రూ.5 వేలు అందించారు. కార్యక్రమంలో శ్రీకాకోళ్లపు రాఘవేంద్ర, భవాని, సింగిరికొండ సుకుమార్, శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, వెంకటరమణ, విద్యార్థుల కుటుంబ సభ్యులు బుస్సా వీరకుమార్, రాచూరి పూర్ణచందర్, వీర్లపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత

Article Image


పేదరికం ఉన్నత చదువులకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి శ్రీకాకోళ్లపు చలపతిరావు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సదన్‌ అపార్ట్‌మెంట్‌లో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం ఆధ్వర్యంలో ముగ్గురు పేద ఆర్యవైశ్య విద్యార్థులకు చలపతిరావు, సులోచన దంపతులు రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న బుస్సా జ్ఞానసాయికి రూ.15 వేలు, ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న వీర్లపాటి జయశ్రీకి రూ.10 వేలు, రాచూరి సహస్రకు రూ.5 వేలు అందించారు. కార్యక్రమంలో శ్రీకాకోళ్లపు రాఘవేంద్ర, భవాని, సింగిరికొండ సుకుమార్, శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, వెంకటరమణ, విద్యార్థుల కుటుంబ సభ్యులు బుస్సా వీరకుమార్, రాచూరి పూర్ణచందర్, వీర్లపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News