నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నెపూసల సీతారాములు ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, బి-బ్లాక్ అధ్యక్షుడు జెర్రిపోతుల సత్యనారాయణ, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడవల్లి నాగరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగూరి వాసవి, సర్పంచ్ బోయిన వేణుతో పాటు పలువురు నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి