శ్రీ సత్యసాయి జిల్లా,పెనుకొండ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయించి, స్థానిక ఎన్డీయే కూటమి, టీడీపీ నాయకులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిచిన పెనుగొండ ఎమ్మెల్యే,జౌలీ చేనేత శాఖల మంత్రి సవితమ్మ. ఈ సందర్బంగా నిర్మించాల్సిన రోడ్లు, చేపట్టాల్సిన డ్రైనేజీ పనులపై అధికారులతో, నాయకులతో చర్చించి , పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పెనుకొండ పట్టణ పరిధిలోని పాత మార్కెట్ను కూడా పరిశీలించారు.ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా మార్కెట్ను పునర్నిర్మించేందుకు అవసరమైన చర్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి