Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేతిలోనే పేలిన సెల్ ఫోన్.. విద్యార్థికి తీవ్ర గాయాలు కోతలేని ‘పోయం’ చికిత్సతో అకాలేషియా బాధితులకు కొత్త ఆశ నల్గొండ మహిళకు యశోదా ఆస్పత్రిలో విజయవంతమైన చికిత్స లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 23, 2026 12:03 AM

సాహస వీరులకు కేంద్రం పిలుపు. టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

సాహస వీరులకు కేంద్రం పిలుపు. టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

సాహస వీరులకు కేంద్రం పిలుపు.  టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
July 21, 2026 08:35 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.15 లక్షల నగదు.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు..

ఆగస్టు 20 వరకు ఆన్‌లైన్‌లో అవకాశం.

న్యూఢిల్లీ స్థానికం ప్రతినిధి :

దేశానికి గౌరవం తీసుకొచ్చే సాహస వీరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. సాహస క్రీడలు, పర్వతారోహణ, సముద్ర యానం, స్కూబా డైవింగ్, గగనతల సాహస విన్యాసాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థల నుంచి ప్రతిష్ఠాత్మక ‘టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం–2025’ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

ఈ పురస్కారాలకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. భూమి, జల, గగన సాహస రంగాల్లో విశిష్ట సేవలు అందించి, దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన వారిని ఈ అవార్డులతో సత్కరించనున్నారు.

విజేతలకు కాంస్య ప్రతిమ, ప్రశంసాపత్రం, బ్లేజర్ (టైతో సహా), రూ.15 లక్షల నగదు బహుమతి అందజేయనున్నారు. అనంతరం భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం ప్రదానం చేయనున్నారు.

వ్యక్తులు, సంస్థలు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ క్రీడా సమాఖ్యలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా అర్హుల పేర్లను నామినేట్ చేసే అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు awards.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సూచించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News