సాహస వీరులకు కేంద్రం పిలుపు. టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
సాహస వీరులకు కేంద్రం పిలుపు. టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
Editor Desk
రూ.15 లక్షల నగదు.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు..
ఆగస్టు 20 వరకు ఆన్లైన్లో అవకాశం.
న్యూఢిల్లీ స్థానికం ప్రతినిధి :
దేశానికి గౌరవం తీసుకొచ్చే సాహస వీరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. సాహస క్రీడలు, పర్వతారోహణ, సముద్ర యానం, స్కూబా డైవింగ్, గగనతల సాహస విన్యాసాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థల నుంచి ప్రతిష్ఠాత్మక ‘టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం–2025’ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
ఈ పురస్కారాలకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. భూమి, జల, గగన సాహస రంగాల్లో విశిష్ట సేవలు అందించి, దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన వారిని ఈ అవార్డులతో సత్కరించనున్నారు.
విజేతలకు కాంస్య ప్రతిమ, ప్రశంసాపత్రం, బ్లేజర్ (టైతో సహా), రూ.15 లక్షల నగదు బహుమతి అందజేయనున్నారు. అనంతరం భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం ప్రదానం చేయనున్నారు.
వ్యక్తులు, సంస్థలు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ క్రీడా సమాఖ్యలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా అర్హుల పేర్లను నామినేట్ చేసే అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు awards.gov.in పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సూచించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి