Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దొడ్డి కొమరయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: డాక్టర్ బంటు కృష్ణ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 07:02 PM

కదిరిలో ఘనంగా వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ ప్రారంభం

కదిరిలో ఘనంగా వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ ప్రారంభం

కదిరిలో ఘనంగా వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ ప్రారంభం
July 04, 2026 04:49 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎస్.టి.ఎస్.ఎన్. డిగ్రీ కళాశాలలో యువత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా మరో కీలక అడుగు పడింది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సహకారంతో ఏర్పాటు చేసిన వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ నూతన భవనాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా విద్యాశాఖాధికారి, విద్యాధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.జిల్లా విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో అత్యుత్తమ విజయాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆసక్తితో ఈ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు నాణ్యమైన అధ్యయన వనరులు, నిపుణుల మార్గదర్శకత్వం, కెరీర్ సూచనలు ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని రూపొందించారు.

ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, కదిరి నియోజకవర్గ యువతకు మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. జిల్లా కలెక్టర్ తీసుకొచ్చిన ఈ వినూత్న కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తానని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా సివిల్స్, గ్రూప్స్ వంటి అత్యున్నత పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద ఆశయాలను యువత ఆచరణలో పెట్టాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర కృషి అత్యంత అవసరమని విద్యార్థులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News