పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు
పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు
Anjali
ముఖ్యమంత్రి చంద్రబాబు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా పుట్టపర్తిలో ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి.
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఏరోనాటికల్ డిఫెన్స్ అకాడమీ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్, యువనేత మరియు రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ విచ్చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా స్థానికంగా చేస్తున్న ఏర్పాట్లను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, స్థానిక కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు మాజీ మంత్రికి ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్ స్థలం, ప్రజల సభా ప్రాంగణం, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు మరియు మీడియా గ్యాలరీ తదితర అంశాలపై మాజీ మంత్రి డాక్టర్ రఘునాథ్ రెడ్డి అధికారులకు తగు సూచనలు అందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి