Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 06:29 PM

పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు
May 11, 2026 07:17 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ముఖ్యమంత్రి చంద్రబాబు, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా పుట్టపర్తిలో ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి.

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఏరోనాటికల్ డిఫెన్స్ అకాడమీ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, యువనేత మరియు రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ విచ్చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా స్థానికంగా చేస్తున్న ఏర్పాట్లను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, స్థానిక కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు మాజీ మంత్రికి ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్ స్థలం, ప్రజల సభా ప్రాంగణం, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు మరియు మీడియా గ్యాలరీ తదితర అంశాలపై మాజీ మంత్రి డాక్టర్ రఘునాథ్ రెడ్డి అధికారులకు తగు సూచనలు అందించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News