మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
K.RAVI
*17వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ
*వార్డు అభివృద్ధికి కృషి చేస్తాం: కౌన్సిలర్ ఉమామహేశ్వరి, కో-ఆప్షన్ మెంబర్ గంగరాములు
మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చౌటుప్పల్ పురపాలక సంఘం 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు, కో-ఆప్షన్ మెంబర్ పస్తం గంగరాములు అన్నారు. చౌటుప్పల్ పురపాలక సంఘం 17వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ చీరల' పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని-రమేష్ గౌడ్ సూచనల మేరకు వార్డులోని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్, కో-ఆప్షన్ మెంబర్లు మాట్లాడుతూ... మహిళల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొనియాడారు. ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లు, ఇందిరమ్మ హౌసింగ్, మహిళా శక్తి, గృహ జ్యోతి పథకాలతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వారు గుర్తు చేశారు. ప్రతి మహిళా స్థిరమైన ఉపాధి అవకాశాలు పొందేలా ఎమ్మెల్యే, పురపాలక సంఘం చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి, వారి సహకారంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, నల్లబెల్లి కిషన్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, ముత్యాల మహాలక్ష్మి, మహిళా సంఘం ఆర్పీ అంతటి అలివేలు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి