సీపీఎం రాజకీయ శిక్షణతోనే పార్టీ బలోపేతం!
సీపీఎం రాజకీయ శిక్షణతోనే పార్టీ బలోపేతం!
K.RAVI
* చౌటుప్పల్లో ఘనంగా ముగిసిన శిక్షణా తరగతులు
* పాల్గొన్న చిన్నకొండూరు సీపీఎం నేత చెరుకు రమేష్ గౌడ్
* ప్రజా సమస్యలపై పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపు
నిరంతరం ప్రజా పక్షాన నిలిచే సీపీఎం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాజకీయ శిక్షణా తరగతులు ఎంతో దోహదపడతాయని చిన్నకొండూరు సీపీఎం నాయకుడు చెరుకు రమేష్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని జీఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్లో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సదస్సులో పార్టీ సిద్ధాంతాలు, సమకాలీన రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై భవిష్యత్ పోరాటాలు, ప్రజా ఉద్యమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై నాయకులు, కార్యకర్తలకు సీనియర్ నేతలు విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా చెరుకు రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇటువంటి శిక్షణా శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
"ప్రజల నిత్య జీవిత సమస్యల పరిష్కారానికి సీపీఎం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా గ్రామస్థాయిలో పార్టీని మరింత విస్తరిస్తాం. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తాం."ఈ శిక్షణ కార్యక్రమంలో సీపీఎం జిల్లా, మండల స్థాయి ముఖ్య నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి