Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:48 AM

ముందు నేనే కడతా... తర్వాత ప్రజలను అడుగుతా..! తెలంగాణకు ఆదర్శమంటూ ప్రశంసలు.

ముందు నేనే కడతా... తర్వాత ప్రజలను అడుగుతా..! తెలంగాణకు ఆదర్శమంటూ ప్రశంసలు.

ముందు నేనే కడతా... తర్వాత ప్రజలను అడుగుతా..!  తెలంగాణకు ఆదర్శమంటూ ప్రశంసలు.
29-06-2026 139 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆచరణే ఆదర్శం.. రూ.11,251 పన్ను స్వయంగా చెల్లించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్.

పన్నులు కట్టాలని ప్రజలకు చెప్పే ముందు.. తానే ముందుగా ఆచరించి చూపించారు ఎల్లంకి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామానికి చెందిన ఆయన తన ఇంటికి సంబంధించిన రూ.11,251 ఇంటి పన్నును స్వయంగా చెల్లించి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు.

ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలంటే ముందుగా ప్రజాప్రతినిధులే బాధ్యతగా తమ పన్నులు చెల్లించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్యపై గ్రామస్తులు, స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ, "తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయం ఇది" అని అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఇంటి పన్నులు ప్రధాన ఆధారమని చెప్పారు. ప్రతి ఇంటి యజమాని సకాలంలో పన్నులు చెల్లిస్తే గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు, రహదారులు వంటి అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

"ప్రజలకు చెప్పే ముందు ప్రజాప్రతినిధులే ఆచరించాలి.. అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Sthanikam

ముందు నేనే కడతా... తర్వాత ప్రజలను అడుగుతా..! తెలంగాణకు ఆదర్శమంటూ ప్రశంసలు.

Article Image

ఆచరణే ఆదర్శం.. రూ.11,251 పన్ను స్వయంగా చెల్లించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్.

పన్నులు కట్టాలని ప్రజలకు చెప్పే ముందు.. తానే ముందుగా ఆచరించి చూపించారు ఎల్లంకి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామానికి చెందిన ఆయన తన ఇంటికి సంబంధించిన రూ.11,251 ఇంటి పన్నును స్వయంగా చెల్లించి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు.

ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలంటే ముందుగా ప్రజాప్రతినిధులే బాధ్యతగా తమ పన్నులు చెల్లించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్యపై గ్రామస్తులు, స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ, "తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయం ఇది" అని అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఇంటి పన్నులు ప్రధాన ఆధారమని చెప్పారు. ప్రతి ఇంటి యజమాని సకాలంలో పన్నులు చెల్లిస్తే గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు, రహదారులు వంటి అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

"ప్రజలకు చెప్పే ముందు ప్రజాప్రతినిధులే ఆచరించాలి.. అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News