ముందు నేనే కడతా... తర్వాత ప్రజలను అడుగుతా..! తెలంగాణకు ఆదర్శమంటూ ప్రశంసలు.
ముందు నేనే కడతా... తర్వాత ప్రజలను అడుగుతా..! తెలంగాణకు ఆదర్శమంటూ ప్రశంసలు.
Editor Desk
ఆచరణే ఆదర్శం.. రూ.11,251 పన్ను స్వయంగా చెల్లించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్.
పన్నులు కట్టాలని ప్రజలకు చెప్పే ముందు.. తానే ముందుగా ఆచరించి చూపించారు ఎల్లంకి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామానికి చెందిన ఆయన తన ఇంటికి సంబంధించిన రూ.11,251 ఇంటి పన్నును స్వయంగా చెల్లించి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు.
ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలంటే ముందుగా ప్రజాప్రతినిధులే బాధ్యతగా తమ పన్నులు చెల్లించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్యపై గ్రామస్తులు, స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ, "తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయం ఇది" అని అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఇంటి పన్నులు ప్రధాన ఆధారమని చెప్పారు. ప్రతి ఇంటి యజమాని సకాలంలో పన్నులు చెల్లిస్తే గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు, రహదారులు వంటి అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
"ప్రజలకు చెప్పే ముందు ప్రజాప్రతినిధులే ఆచరించాలి.. అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి