తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో గురువారం ప్రాథమిక పాఠశా లో సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, ఉపసర్పంచ్ అనే బోయిన శ్రీకాంత్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులకు మంచి భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు. అనుభవం కలిగిన ఉపాధ్యాయులుమంచి విద్యను అభ్యసిస్తారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం, యూనిఫాము, కంప్యూటర్ విద్య, గ్రంథాలయము సైన్స్ ల్యాబులు ఉంటాయని అన్నారు. కావున గ్రామాల్లోని తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లి తండ్రులకు పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
WhatsAppCopy LinkSave Image

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి