Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:47 AM

న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.

న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.

న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.
18-06-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలోని అన్ని నమోదిత న్యాయవాదులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 20న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న న్యాయవాదుల ధర్నా కరపత్రాన్ని గురువారం రామన్నపేట బార్ అసోసియేషన్ హాల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 తర్వాత నమోదు చేసుకున్న వేలాది మంది న్యాయవాదులు ఇప్పటికీ హెల్త్ కార్డుల ప్రయోజనాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. ఆరోగ్య బీమా పరిమితి పెంపుతో పాటు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను కూడా బీమా పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఆసుపత్రులను ఎంపానెల్ చేయడంతో పాటు అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు అదనపు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. మజీద్, కార్యదర్శి యాదాసు యాదయ్య, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి బాలరాజు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.

Article Image

రాష్ట్రంలోని అన్ని నమోదిత న్యాయవాదులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 20న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న న్యాయవాదుల ధర్నా కరపత్రాన్ని గురువారం రామన్నపేట బార్ అసోసియేషన్ హాల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 తర్వాత నమోదు చేసుకున్న వేలాది మంది న్యాయవాదులు ఇప్పటికీ హెల్త్ కార్డుల ప్రయోజనాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. ఆరోగ్య బీమా పరిమితి పెంపుతో పాటు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను కూడా బీమా పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఆసుపత్రులను ఎంపానెల్ చేయడంతో పాటు అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు అదనపు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. మజీద్, కార్యదర్శి యాదాసు యాదయ్య, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి బాలరాజు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News