Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:08 PM

మానూర్‌లో పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు – నూతన కార్యదర్శులకు ఘన స్వాగత సన్మానం

మానూర్‌లో పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు – నూతన కార్యదర్శులకు ఘన స్వాగత సన్మానం

మానూర్‌లో పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు – నూతన కార్యదర్శులకు ఘన స్వాగత సన్మానం
17-06-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ వీడ్కోలు, నూతన కార్యదర్శుల స్వాగత సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డివిజన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ పంచాయతీ అధికారికి శాలువా, పూలమాలలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ వారు మండల అభివృద్ధికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే బదిలీపై మనూర్ మండలానికి నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బదిలీలు ఉద్యోగ జీవితంలో సహజమైన భాగమని, కొత్తగా వచ్చిన కార్యదర్శులు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు మరియు మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శుల సేవలు గ్రామాల అభివృద్ధికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఆత్మీయ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మానూర్‌లో పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు – నూతన కార్యదర్శులకు ఘన స్వాగత సన్మానం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ వీడ్కోలు, నూతన కార్యదర్శుల స్వాగత సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డివిజన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ పంచాయతీ అధికారికి శాలువా, పూలమాలలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ వారు మండల అభివృద్ధికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే బదిలీపై మనూర్ మండలానికి నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బదిలీలు ఉద్యోగ జీవితంలో సహజమైన భాగమని, కొత్తగా వచ్చిన కార్యదర్శులు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు మరియు మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శుల సేవలు గ్రామాల అభివృద్ధికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఆత్మీయ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News