మానూర్లో పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు – నూతన కార్యదర్శులకు ఘన స్వాగత సన్మానం
మానూర్లో పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు – నూతన కార్యదర్శులకు ఘన స్వాగత సన్మానం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ వీడ్కోలు, నూతన కార్యదర్శుల స్వాగత సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డివిజన్కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ పంచాయతీ అధికారికి శాలువా, పూలమాలలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ వారు మండల అభివృద్ధికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే బదిలీపై మనూర్ మండలానికి నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బదిలీలు ఉద్యోగ జీవితంలో సహజమైన భాగమని, కొత్తగా వచ్చిన కార్యదర్శులు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు మరియు మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శుల సేవలు గ్రామాల అభివృద్ధికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఆత్మీయ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి