తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ రాష్ట్ర సాధనకు మేధోబలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని వెలిమినేడు గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తిగా ఆయన సేవలను కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన జయశంకర్ సార్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య గౌడ్, వార్డు సభ్యులు మంకాల లింగస్వామి, ఆరూరి సునీత రవి, చింతకింది వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి తాటికొండ లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తిరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు చీమల వీరేశం, కిసాన్ మోర్చా జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు వెల్ది రాఘవరెడ్డి, సీపీఎం పార్టీ కార్యదర్శి పంది నరేష్, నాయకులు కర్దూరి అంజిరెడ్డి, చింతకాయల శివకృష్ణ, చిర్రగోని నరసింహ, వరికుప్పల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి