యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య (46) ఈ నెల 5న సాయంత్రం భార్య రేవనాల పద్మ, కుమార్తె శివమణితో కలిసి తన వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. ఐలయ్య, రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా నేలపై కుప్పకూలాడు. నోటి నుంచి నురుగు రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు
మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సతీష్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి