Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి – తపస్ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి.. ఆరు డీఏలను ఒకేసారి విడుదల చేయాలి. తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 07:06 PM

ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం

ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం

ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం
06-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్

రాష్ట్ర పార్టీ కార్యాచరణలో భాగంగా చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్ వద్ద చేపట్టిన ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షలకు యువ నాయకురాలు డా. బొత్స అనూష, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సంఘీభావం తెలిపారు. దీక్షల తొలి రోజున గుర్ల మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి, సామాజిక మాధ్యమాల విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డా. బొత్స అనూష, బెల్లాన చంద్రశేఖర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో పాల్గొంటున్న వారికి మద్దతు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతి రాణి, కేవీ సూర్యనారాయణ (పులిరాజు), గుర్ల మండల నాయకుడు సన్యాసి నాయుడు, యువ నాయకులు బెల్లాన వంశీకృష్ణ, అప్పలనాయుడు, ఈశ్వరరావు, బంగారు నాయుడు, మణి, తిరుపతి, మధుసూదన్, విద్యార్థి నాయకులు కార్తీక్, కెల్ల సురేష్తో పాటు చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి, సామాజిక మాధ్యమాల విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం

Article Image

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్

రాష్ట్ర పార్టీ కార్యాచరణలో భాగంగా చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్ వద్ద చేపట్టిన ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షలకు యువ నాయకురాలు డా. బొత్స అనూష, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సంఘీభావం తెలిపారు. దీక్షల తొలి రోజున గుర్ల మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి, సామాజిక మాధ్యమాల విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డా. బొత్స అనూష, బెల్లాన చంద్రశేఖర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో పాల్గొంటున్న వారికి మద్దతు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతి రాణి, కేవీ సూర్యనారాయణ (పులిరాజు), గుర్ల మండల నాయకుడు సన్యాసి నాయుడు, యువ నాయకులు బెల్లాన వంశీకృష్ణ, అప్పలనాయుడు, ఈశ్వరరావు, బంగారు నాయుడు, మణి, తిరుపతి, మధుసూదన్, విద్యార్థి నాయకులు కార్తీక్, కెల్ల సురేష్తో పాటు చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి, సామాజిక మాధ్యమాల విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News