Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. పల్లె దవాఖానాకు డాక్టర్‌ను నియమించాలి కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 06:03 PM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జయంతి వేడుకలు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జయంతి వేడుకలు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జయంతి వేడుకలు.
06-08-2026 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆచార్య జయశంకర్ సేవలు చిరస్మరణీయం.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ ఆచార్య ఆర్. రత్నమంజుల అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని, తెలంగాణ సిద్ధాంతకర్తగా ఆయన అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.అకడమిక్ కోఆర్డినేటర్, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ డి. కిషన్ మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను తన రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలకు వివరించారని చెప్పారు. విశాలాంధ్ర ఏర్పాటులోని లోపాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే నీళ్లు, నిధులు, ఉద్యోగాలపై తెలంగాణ ప్రజలకు హక్కులు దక్కుతాయని ఆయన బలంగా వాదించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాంతం పోరాడి, రాష్ట్ర ఆవిర్భావాన్ని చూడకముందే ఆయన కన్నుమూయడం బాధాకరమని అన్నారు.

కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. లక్ష్మీ నీలిమ, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జయంతి వేడుకలు.

Article Image

ఆచార్య జయశంకర్ సేవలు చిరస్మరణీయం.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ ఆచార్య ఆర్. రత్నమంజుల అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని, తెలంగాణ సిద్ధాంతకర్తగా ఆయన అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.అకడమిక్ కోఆర్డినేటర్, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ డి. కిషన్ మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను తన రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలకు వివరించారని చెప్పారు. విశాలాంధ్ర ఏర్పాటులోని లోపాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే నీళ్లు, నిధులు, ఉద్యోగాలపై తెలంగాణ ప్రజలకు హక్కులు దక్కుతాయని ఆయన బలంగా వాదించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాంతం పోరాడి, రాష్ట్ర ఆవిర్భావాన్ని చూడకముందే ఆయన కన్నుమూయడం బాధాకరమని అన్నారు.

కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. లక్ష్మీ నీలిమ, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News