ఆచార్య జయశంకర్ సేవలు చిరస్మరణీయం.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇన్చార్జ్ ప్రిన్సిపల్ ఆచార్య ఆర్. రత్నమంజుల అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని, తెలంగాణ సిద్ధాంతకర్తగా ఆయన అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.అకడమిక్ కోఆర్డినేటర్, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ డి. కిషన్ మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను తన రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలకు వివరించారని చెప్పారు. విశాలాంధ్ర ఏర్పాటులోని లోపాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే నీళ్లు, నిధులు, ఉద్యోగాలపై తెలంగాణ ప్రజలకు హక్కులు దక్కుతాయని ఆయన బలంగా వాదించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాంతం పోరాడి, రాష్ట్ర ఆవిర్భావాన్ని చూడకముందే ఆయన కన్నుమూయడం బాధాకరమని అన్నారు.
కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. లక్ష్మీ నీలిమ, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి