శ్రీ వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, కార్యవర్గ సభ్యుడు కొండా అనిల్ కుమార్లను సుప్రీం కోర్టు న్యాయవాది నేరేళ్ల మాల్యాద్రి, యాదగిరిగుట్ట ధర్మకర్త గుండా మల్లయ్య గుప్తా, శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టి సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుల సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.
PRINT TIME: August 06, 2026 05:13 PM
శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీకి రవీంద్ర భారతిలో ఘన సన్మానం
శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీకి రవీంద్ర భారతిలో ఘన సన్మానం
06-08-2026
72 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
శ్రీ వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, కార్యవర్గ సభ్యుడు కొండా అనిల్ కుమార్లను సుప్రీం కోర్టు న్యాయవాది నేరేళ్ల మాల్యాద్రి, యాదగిరిగుట్ట ధర్మకర్త గుండా మల్లయ్య గుప్తా, శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టి సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుల సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి