Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి – తపస్ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి.. ఆరు డీఏలను ఒకేసారి విడుదల చేయాలి. తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 07:13 PM

చుండూరు అమరవీరులకు ఘన నివాళులు

చుండూరు అమరవీరులకు ఘన నివాళులు

చుండూరు అమరవీరులకు ఘన నివాళులు
06-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

35 ఏళ్లైనా బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన

చుండూరులో కులవివక్ష నేపథ్యంలో దళితులపై జరిగిన దారుణ ఘటనను మరువలేమని, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పేర్కొన్నారు.

చుండూరు ఘటనకు 35 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గురువారం గోదావరిఖనిలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్‌లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చుండూరు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పెద్దపెల్లి జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బొంకూరి మధు, కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్, కాంపెల్లి సతీష్, ఈదునూరి పద్మ మాట్లాడుతూ చుండూరు ఘటనలో కులదురహంకారంతో ఎనిమిది మంది దళితులను అత్యంత దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఘటన జరిగి 35 సంవత్సరాలు గడిచినా బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చుండూరు అమరవీరులకు న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బొచ్చు శంకర్, జనగామ రాజనర్సు, గద్దల శశిభూషణ్, బూడిద సమ్మయ్య, మేకల సురేష్, పుల్లూరి మహేందర్, పంజా అశోక్, కాంపెల్లి జీవన్ కుమార్, రామగిరి రమేష్, జిలకర రామస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈదునూరి పద్మ, జనగామ రాజనర్సు ఆలపించిన చుండూరు ఘటనకు సంబంధించిన పాటలు పలువురిని భావోద్వేగానికి గురిచేశాయి. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

చుండూరు అమరవీరులకు ఘన నివాళులు

Article Image

35 ఏళ్లైనా బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన

చుండూరులో కులవివక్ష నేపథ్యంలో దళితులపై జరిగిన దారుణ ఘటనను మరువలేమని, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పేర్కొన్నారు.

చుండూరు ఘటనకు 35 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గురువారం గోదావరిఖనిలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్‌లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చుండూరు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పెద్దపెల్లి జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బొంకూరి మధు, కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్, కాంపెల్లి సతీష్, ఈదునూరి పద్మ మాట్లాడుతూ చుండూరు ఘటనలో కులదురహంకారంతో ఎనిమిది మంది దళితులను అత్యంత దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఘటన జరిగి 35 సంవత్సరాలు గడిచినా బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చుండూరు అమరవీరులకు న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బొచ్చు శంకర్, జనగామ రాజనర్సు, గద్దల శశిభూషణ్, బూడిద సమ్మయ్య, మేకల సురేష్, పుల్లూరి మహేందర్, పంజా అశోక్, కాంపెల్లి జీవన్ కుమార్, రామగిరి రమేష్, జిలకర రామస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈదునూరి పద్మ, జనగామ రాజనర్సు ఆలపించిన చుండూరు ఘటనకు సంబంధించిన పాటలు పలువురిని భావోద్వేగానికి గురిచేశాయి. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News