తూర్పుపల్లిలో 20–30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. సూత్రధారుల వేట ప్రారంభం.
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 20 నుంచి 30 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిలో బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అక్రమ రవాణా వెలుగుచూసింది.
స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని, అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.
పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర సరుకులు, రేషన్ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను త్వరలోనే రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి