Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 10:58 PM

అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి

అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి

అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి
05-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తూర్పుపల్లిలో 20–30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. సూత్రధారుల వేట ప్రారంభం.


నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 20 నుంచి 30 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అక్రమ రవాణా వెలుగుచూసింది.

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని, అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.

పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర సరుకులు, రేషన్ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను త్వరలోనే రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Sthanikam

అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి

Article Image

తూర్పుపల్లిలో 20–30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. సూత్రధారుల వేట ప్రారంభం.


నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 20 నుంచి 30 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అక్రమ రవాణా వెలుగుచూసింది.

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని, అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.

పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర సరుకులు, రేషన్ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను త్వరలోనే రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News