‘సైబర్ జాగూరుకత’ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి సూచించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం వనస్థలిపురం పరిధిలో "సైబర్ జాగూరుకత" అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ కాశిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పెట్టుబడుల పేరుతో మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, ఫోటో మార్ఫింగ్, డేటా హ్యాకింగ్, ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఉదయం ఇంజాపూర్ సంజీవని వనం పార్క్, ఎన్జీఓస్ కాలనీలోని వివేకానంద పార్క్, ఆటోనగర్ డీర్ పార్క్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కృష్ణవేణి కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులకు ప్రత్యేక సదస్సు నిర్వహించి సైబర్ నేరాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ ఏసీపీ శివశంకర్, వనస్థలిపురం ఎస్హెచ్ఓ రవిబాబు, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్లు కృష్ణంరాజు, నాగచారి, ఎస్ఐలు గిరీష్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి