Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
22 రోస్టర్ పాయింట్లకు చట్టబద్ధ రక్షణ కల్పించాలి ఎస్సీ వర్గీకరణను యథాతథంగా కొనసాగించాలని నల్గొండలో మాల మహానాడు భారీ నిరసన కోతలేని ‘పోయం’ చికిత్సతో అకాలేషియా బాధితులకు కొత్త ఆశ నల్గొండ మహిళకు యశోదా ఆస్పత్రిలో విజయవంతమైన చికిత్స లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 09:48 PM

బెల్టు షాపుపై దాడి.. భారీగా మద్యం సీసాల స్వాధీనం!

బెల్టు షాపుపై దాడి.. భారీగా మద్యం సీసాల స్వాధీనం!

బెల్టు షాపుపై దాడి.. భారీగా మద్యం సీసాల స్వాధీనం!
July 22, 2026 08:22 PM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కిరాణా షాపు ముసుగులో దందా

చౌటుప్పల్ మండల పరిధిలోని పెద్దకొండూరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొండూరు గ్రామానికి చెందిన కూడబోయిన లాలూ ప్రసాద్ (34) తన కిరాణా షాపులో అక్రమంగా మద్యం సీసాలు ఉంచి విక్రయిస్తున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ వి.శ్రీనివాస్, ఏఆర్ పీసీ సైదులులు పీఎం 1 విధులు నిర్వర్తిస్తుండగా సదరు కిరాణా షాపుపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ​ఈ తనిఖీల్లో అక్రమంగా విక్రయించడానికి ఉంచిన పెద్ద ఎత్తున మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

​స్వాధీనం చేసుకున్న మద్యం వివరాలు ​కే-కే విస్కీ (180ml) 31, ​ఓసీ విస్కీ (180ml) 05,ఓసీ విస్కీ (90ml)10,​ఇంపీరియల్ బ్లూ (180ml) 11, ​ఇంపీరియల్ బ్లూ (90ml) 08, ​కేఎఫ్ లైట్ బీర్లు (650ml) 15, ​నాకౌట్ బీర్లు (650ml) 06, ​రాయల్ ఛాలెంజర్ బీర్లు (650ml) 04 ​సదరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, నిందితుడు కూడబోయిన లాలూ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మథ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News