మంత్రి హోదా పొందిన వేముల వీరేశంకు ఘనాభినందనలు
మంత్రి హోదా పొందిన వేముల వీరేశంకు ఘనాభినందనలు
Komidala Mahender reddy
నోట్బుక్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.
నకిరేకల్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్గా నియమితులై మంత్రి హోదా పొందిన వేముల వీరేశంను నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశంకు నోట్బుక్లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత, ప్రజా సమస్యల పరిష్కారంలో తీసుకుంటున్న చొరవకు గుర్తింపుగానే ప్రభుత్వం విప్ పదవితో పాటు మంత్రి హోదా కల్పించిందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అంతటి రాజు, గోలి ఆంజనేయులు, బద్దం మల్లేష్, గోలి నరేష్ తదితరులు పాల్గొని వేముల వీరేశంకు అభినందనలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో మరింత కృషి చేస్తామని వారు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి