Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:55 AM

మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు

మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు

మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు
08-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, రికార్డుల విషయంలో ఆరోపణలు.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

న్యాల్కల్ మండల్ మిర్జాపూర్ (ఎన్) గ్రామ పంచాయతీ కార్యదర్శి విధుల నిర్వహణపై గ్రామానికి చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఇన్‌చార్జి ఎంపీడీఓను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, పంచాయతీకి సంబంధించిన కొన్ని రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే వార్డు సభ్యులతో సరైన సమన్వయం లేకుండా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు చేశారు.పంచాయతీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరారు.

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉన్నట్లు విచారణలో తేలితే పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి ఎంపీడీఓకు విజ్ఞప్తి చేశారు.గ్రామ పంచాయతీ అభివృద్ధి, ప్రజలకు అందాల్సిన సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఫిర్యాదు అందజేసిన వారిలో రాజు, స్వప్న, జగదీశ్వర్, సువర్ణ తదితరులు ఉన్నారు.

Sthanikam

మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు

Article Image

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, రికార్డుల విషయంలో ఆరోపణలు.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

న్యాల్కల్ మండల్ మిర్జాపూర్ (ఎన్) గ్రామ పంచాయతీ కార్యదర్శి విధుల నిర్వహణపై గ్రామానికి చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఇన్‌చార్జి ఎంపీడీఓను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, పంచాయతీకి సంబంధించిన కొన్ని రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే వార్డు సభ్యులతో సరైన సమన్వయం లేకుండా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు చేశారు.పంచాయతీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరారు.

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉన్నట్లు విచారణలో తేలితే పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి ఎంపీడీఓకు విజ్ఞప్తి చేశారు.గ్రామ పంచాయతీ అభివృద్ధి, ప్రజలకు అందాల్సిన సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఫిర్యాదు అందజేసిన వారిలో రాజు, స్వప్న, జగదీశ్వర్, సువర్ణ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News