Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్‌ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి.. వై. పండరి విజ్ఞప్తి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 08:02 PM

ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి
07-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ఆర్డీవోకు ఆర్‌టీఐ కార్యకర్తల వినతి

పీఐఓలు బాధ్యతాయుతంగా సమాచారం అందించాలని డిమాండ్

చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం (RTI) బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్‌టీఐ కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ గౌస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో ఆయన అధికారులకు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డివిజన్ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పాత బోర్డులలోని అధికారుల పేర్లను ఇప్పటికీ మార్చలేదని, కొన్ని శాఖల్లో అసలు ఆర్టిఐ బోర్డులే లేవని పేర్కొన్నారు. ముఖ్యంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని జూనియర్ సివిల్ కోర్టులో నేటికీ సమాచార హక్కు చట్టం-2005 బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్ల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకోవడానికి దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ​దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం అందేలా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను ఆర్డీవో ఆదేశించాలి. ​అన్ని శాఖల్లో పాత బోర్డుల స్థానంలో నూతన అధికారుల వివరాలతో కూడిన ఆర్‌టీఐ బోర్డులు పునరుద్ధరించాలి. ​గత ప్రభుత్వ హయాంలో సమాచార హక్కు చట్టంపై ప్రభుత్వపరంగా సరైన అవగాహన సదస్సులు నిర్వహించలేదని, ఈసారి వచ్చే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సామాజిక కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ అధికారులు అధికారికంగా నిర్వహించాలని అన్నారు.

Sthanikam

ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి

Article Image

చౌటుప్పల్ ఆర్డీవోకు ఆర్‌టీఐ కార్యకర్తల వినతి

పీఐఓలు బాధ్యతాయుతంగా సమాచారం అందించాలని డిమాండ్

చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం (RTI) బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్‌టీఐ కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ గౌస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో ఆయన అధికారులకు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డివిజన్ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పాత బోర్డులలోని అధికారుల పేర్లను ఇప్పటికీ మార్చలేదని, కొన్ని శాఖల్లో అసలు ఆర్టిఐ బోర్డులే లేవని పేర్కొన్నారు. ముఖ్యంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని జూనియర్ సివిల్ కోర్టులో నేటికీ సమాచార హక్కు చట్టం-2005 బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్ల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకోవడానికి దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ​దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం అందేలా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను ఆర్డీవో ఆదేశించాలి. ​అన్ని శాఖల్లో పాత బోర్డుల స్థానంలో నూతన అధికారుల వివరాలతో కూడిన ఆర్‌టీఐ బోర్డులు పునరుద్ధరించాలి. ​గత ప్రభుత్వ హయాంలో సమాచార హక్కు చట్టంపై ప్రభుత్వపరంగా సరైన అవగాహన సదస్సులు నిర్వహించలేదని, ఈసారి వచ్చే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సామాజిక కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ అధికారులు అధికారికంగా నిర్వహించాలని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News