దేశంలోనే రెండో ర్యాంక్.. రూ.20 లక్షల నగదు బహుమతితో జాతీయ అవార్డు.
నల్లగొండను తెలంగాణలో నంబర్–1 కార్పొరేషన్గా తీర్చిదిద్దడమే లక్ష్యం.
నల్లగొండ: స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది. గాలి నాణ్యత మెరుగుదల, రహదారి దుమ్ము నియంత్రణ, పచ్చదనం పెంపు, పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ వంటి చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో నల్లగొండకు లభించిన ఈ ఘనత నగరవాసుల్లో ఆనందం, గర్వాన్ని నింపింది.
నగరంలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన పలు కార్యక్రమాలు అవార్డు సాధనలో కీలకంగా నిలిచాయని మేయర్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల (GVP) రూపాంతరం, ఎంఆర్ఎఫ్ ప్లాంట్ వంటి చర్యలు నగర పరిశుభ్రతకు దోహదపడ్డాయని తెలిపారు.నగర అభివృద్ధికి సహకరిస్తున్న నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రూ.20 లక్షల నగదు బహుమతితో పాటు జాతీయ అవార్డును స్వీకరించడం నల్లగొండకు గర్వకారణమన్నారు.
నల్లగొండను స్వచ్ఛమైన, పచ్చని, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్ది తెలంగాణలోనే నంబర్–1 కార్పొరేషన్గా నిలపడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి