Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 06:59 PM

నాలుగు గంటల్లో వృద్ధురాలి ఆచూకీ.. కుటుంబ సభ్యులకు అప్పగింత

నాలుగు గంటల్లో వృద్ధురాలి ఆచూకీ.. కుటుంబ సభ్యులకు అప్పగింత

నాలుగు గంటల్లో వృద్ధురాలి ఆచూకీ.. కుటుంబ సభ్యులకు అప్పగింత
07-09-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంతాపూర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల ఆమీనాబీ సోమవారం ఉదయం తన కూతురు నివాసం ఉన్న వడ్డీ గ్రామానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ సమాచారం లభించకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె మనవడు తాహిర్‌బీ హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, కేవలం నాలుగు గంటల్లోనే ఆమీనాబీ ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. పోలీసుల చురుకైన చర్యలతో వృద్ధురాలి ఆచూకీ త్వరగా లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ తెలిపారు.

Sthanikam

నాలుగు గంటల్లో వృద్ధురాలి ఆచూకీ.. కుటుంబ సభ్యులకు అప్పగింత

Article Image

హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంతాపూర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల ఆమీనాబీ సోమవారం ఉదయం తన కూతురు నివాసం ఉన్న వడ్డీ గ్రామానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ సమాచారం లభించకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె మనవడు తాహిర్‌బీ హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, కేవలం నాలుగు గంటల్లోనే ఆమీనాబీ ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. పోలీసుల చురుకైన చర్యలతో వృద్ధురాలి ఆచూకీ త్వరగా లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News