Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చలో అసెంబ్లీ’కి బయలుదేరిన బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 10:21 AM

చలో అసెంబ్లీ’కి బయలుదేరిన బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

చలో అసెంబ్లీ’కి బయలుదేరిన బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

చలో అసెంబ్లీ’కి బయలుదేరిన బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు
07-09-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపుమేరకు చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసేందుకు అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకుని ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేపీ నాయకులు ఖండించారు.ముందస్తు అరెస్టయిన వారిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌ గౌడ్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్‌, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ కూరెళ్ల శ్రీనివాస్‌, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్‌, బీజేవైఎం నాయకులు పాల రవివర్మ, నూకేష్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

Sthanikam

చలో అసెంబ్లీ’కి బయలుదేరిన బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

Article Image

చిట్యాల: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపుమేరకు చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసేందుకు అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకుని ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేపీ నాయకులు ఖండించారు.ముందస్తు అరెస్టయిన వారిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌ గౌడ్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్‌, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ కూరెళ్ల శ్రీనివాస్‌, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్‌, బీజేవైఎం నాయకులు పాల రవివర్మ, నూకేష్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News