నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యతను కాపాడే లక్ష్యంతో జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ మేరకు ఈ సమావేశానికి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ఆసిఫ్ అధ్యక్షతన కొనసాగింది కాగా నియోజకవర్గంలోని అన్ని మండలాల జర్నలిస్టులు సమావేశమై నూతన బాడీని ఎంపిక చేశారు.ఆదివారం నారాయణఖేడ్ లోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో tuwj (iju) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు వృత్తిలో క్రమశిక్షణ చాలా అవసరమని, ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వార్తలు రాయాలని సూచించారు.నారాయణఖేడ్ నియోజకవర్గ జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
కాగా నియోజకవర్గ కేంద్రంలో జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యతను కాపాడే లక్ష్యంతో జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల జర్నలిస్టులు సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది.ఈ నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులు అధ్యక్షులుగా ఎం.ఎ. అలీమ్, అధ్యక్షులుగా జి. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కె. భూమయ్య బాధ్యతలు స్వీకరించారు.
ఉపాధ్యక్షులుగా బిరాదర్ సంగప్ప మనుర్. సంగారెడ్డి నారాయణఖేడ్. నుకాల రాజేశ్వర్ కంగ్టి. రమేష్ గౌడ్ కల్హర్, జి. విట్టల్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎం.ఎ. నాతిక్ బాధ్యతలు చేపట్టనున్నారు.అలాగే సహాయ కార్యదర్శులుగా లింగాపురం అంజయ్య, రషీద్, జైపాల్ రెడ్డి, ఎండీ ఫహీమ్; సంస్థ కార్యదర్శులుగా కె.సంతోష్ చారి , వీరారెడ్డి ఎంపిక కాగా; కార్యవర్గ సభ్యులుగా ఎం.ఎ. సత్తార్, శరణప్ప, శంకర్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు, జర్నలిస్టుల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి