సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా చెక్కును ఏజెంట్ తొట్ల మంజుల సుధాకర్ ఆధ్వర్యంలో సంస్థ ఉన్నత అధికారులతో కలిసి లబ్ధిదారునికి అందజేశారు.
గ్రామానికి చెందిన మల్లెపాక నిర్మల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకొని రూ. 15,574 చెల్లించిన తదుపరి 4 నెలల క్రితం వడదెబ్బ కారణంగా మృతి చెందడం తో నామినీ అయిన మల్లెపాక పెద్ద వీరయ్య కు శ్రీరామ్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ రూ. 2,47,327 ల చెక్ ను అందజేశారు.
ఈ సందర్భంగా డెవలప్మెంట్ ఆఫీసర్ తొట్ల సుధాకర్ మాట్లాడుతూ
ఇన్సూరెన్స్ అంటే చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు కాదని, ప్రీమియం రూపంలో పొదుపు చేసుకుంటూ పోతే చివరగా మనకు ఉపయోగ పడుతుందని తెలిపారు .ఈ మధ్య కాలంలో యజమానికి ఏమైనా జరిగితే కుటుంబం రోడ్డున పడకుండా అండగా నిలబడుతుందని తెలిపారు. ఇన్సూరెన్స్ బాండ్ అంటే ఒక పేపర్ కాదని, పాలసీదారుని ఆదాయ గని అని తెలిపారు.దేశంలో 4% మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకున్నారని మిగిలిన 96% జనాభా కి అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని అన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా రకాల గ్యారెంటీడ్ ఎడిషన్ పాలసీలు ఉన్నాయని చెప్పారు. ఈ గ్యారెంటీ ఎడిషన్ ప్లాన్ లో మేము చెప్పే ప్రతి మాట బాండ్ లో చూపించి మీకు ఇస్తామని అన్నారు. మూడు రోజుల క్రితం మిర్యాలగూడలో 74 లక్షల చెక్కును అందజేశామని వారు లక్ష చొప్పున రెండు ప్రీమియంలు మాత్రమే చెల్లించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ లో తన ఆర్థిక స్తోమతకు తగిన పాలసీలు ఎన్నుకొని చెల్లించి భరోసాతో జీవించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడుదుల రమేష్, డీజీఎం గంగుల సతీష్ కుమార్ ,డిఎం భరత్ కుమార్ డి ఓ రాజు, యాకయ్య ,చందు, ప్రశాంత్ ,ఏజెంట్లు ,బింగి వెంకటేశ్వర్లు ,చెర్ర నరేష్, పులుసు కల్పన ,సుధాకర్, బికి పరమేష్ ,బాలకృష్ణ, రాములు ,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి