ప్రభుత్వానికి సీపీఎం నేతల వినతి.
నకిరేకల్: నకిరేకల్ పట్టణంలో నూతనంగా నిర్మించి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి అమరజీవి నర్రా రాఘవరెడ్డి పేరు పెట్టాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ.. నర్రా రాఘవరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన ప్రజానాయకుడని అన్నారు. నకిరేకల్ ప్రాంత అభివృద్ధికి, పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాంటి అమరజీవి పేరును నూతనంగా ప్రారంభమైన 100 పడకల ఆస్పత్రికి పెట్టడం సముచితమైన గౌరవమని అన్నారు.
ఆస్పత్రికి నర్రా రాఘవరెడ్డి పేరు పెట్టేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, బొజ్జ చిన్న వెంకులు, పెంజర్ల సైదులు, వంటెపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి