రామన్నపేట నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం నిర్వహించిన వెయ్యి రోజుల ప్రజాపాలన వికాస సభకు రామన్నపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు 60 వాహనాల్లో సుమారు 8,500 మంది సభకు హాజరైనట్లు మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నకిరేకల్లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని జగన్మోహన్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. ఒకవైపు అప్పులు చెల్లిస్తూనే.. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందకపోయినా అందుబాటులో ఉన్న బడ్జెట్తో సమగ్ర ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి