Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 10:06 PM

రామన్నపేట దవాఖానకు 100 పడకలు మంజూరు చేయాలి.కామ్రేడ్ రెబ్బాస్ రాములు

రామన్నపేట దవాఖానకు 100 పడకలు మంజూరు చేయాలి.కామ్రేడ్ రెబ్బాస్ రాములు

రామన్నపేట దవాఖానకు 100 పడకలు మంజూరు చేయాలి.కామ్రేడ్ రెబ్బాస్ రాములు
04-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లాలి:

రామన్నపేట, సెప్టెంబర్ 4:

రామన్నపేట ప్రభుత్వ దవాఖానను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయించి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యమకారుడు కామ్రేడ్ రెబ్బాస్ రాములు డిమాండ్ చేశారు.

75 సంవత్సరాల చరిత్ర కలిగిన రామన్నపేట ప్రభుత్వ దవాఖాన ఇప్పటికీ 10 నుంచి 50 పడకలకే పరిమితమైందని, పాత భవనంలోనే వైద్య సేవలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రోజుకు 500 నుంచి 600 మంది వరకు రోగులు వస్తున్నప్పటికీ, సరిపడా వైద్యులు, అన్ని విభాగాల వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులను హైదరాబాద్, నల్లగొండకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

రూ.40 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి.

తెలంగాణతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు చిన్న ఆసుపత్రులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 100 పడకల ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటప్పుడు రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు ఎందుకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నించారు.

ఇప్పటికైనా స్థానిక ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడాలని, రూ.40 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేయించాలని మండల ఉద్యమకారుల ఫోరం తరఫున కామ్రేడ్ రెబ్బాస్ రాములు డిమాండ్ చేశారు.

Sthanikam

రామన్నపేట దవాఖానకు 100 పడకలు మంజూరు చేయాలి.కామ్రేడ్ రెబ్బాస్ రాములు

Article Image

సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లాలి:

రామన్నపేట, సెప్టెంబర్ 4:

రామన్నపేట ప్రభుత్వ దవాఖానను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయించి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యమకారుడు కామ్రేడ్ రెబ్బాస్ రాములు డిమాండ్ చేశారు.

75 సంవత్సరాల చరిత్ర కలిగిన రామన్నపేట ప్రభుత్వ దవాఖాన ఇప్పటికీ 10 నుంచి 50 పడకలకే పరిమితమైందని, పాత భవనంలోనే వైద్య సేవలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రోజుకు 500 నుంచి 600 మంది వరకు రోగులు వస్తున్నప్పటికీ, సరిపడా వైద్యులు, అన్ని విభాగాల వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులను హైదరాబాద్, నల్లగొండకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

రూ.40 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి.

తెలంగాణతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు చిన్న ఆసుపత్రులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 100 పడకల ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటప్పుడు రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు ఎందుకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నించారు.

ఇప్పటికైనా స్థానిక ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడాలని, రూ.40 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేయించాలని మండల ఉద్యమకారుల ఫోరం తరఫున కామ్రేడ్ రెబ్బాస్ రాములు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News