Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం సభను విజయవంతం చేయాలి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 12:08 PM

సీఎం సభను విజయవంతం చేయాలి

సీఎం సభను విజయవంతం చేయాలి

సీఎం సభను విజయవంతం చేయాలి
04-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కాంగ్రెస్ శ్రేణులకు గోలి నరేష్ పిలుపు.

చిట్యాల: నకిరేకల్‌లో ఈ నెల 5న నిర్వహించనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గోలి నరేష్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.గ్రామాలు, మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలు ప్రజలను సమీకరించి సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని గోలి నరేష్ కోరారు.


Sthanikam

సీఎం సభను విజయవంతం చేయాలి

Article Image

కాంగ్రెస్ శ్రేణులకు గోలి నరేష్ పిలుపు.

చిట్యాల: నకిరేకల్‌లో ఈ నెల 5న నిర్వహించనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గోలి నరేష్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.గ్రామాలు, మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలు ప్రజలను సమీకరించి సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని గోలి నరేష్ కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News