సూర్యాపేట: జిల్లా ఎస్పీ కె. నరసింహ, IPS ఆదేశాల మేరకు మహిళలు, కాలేజీ విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పించేందుకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థినులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షీ టీమ్స్ ఎస్ఐ జి. నీలిమ మాట్లాడుతూ కాలేజీలు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళలు, యువతుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
కాలేజీలు, షాపింగ్ మాల్స్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసుల నిఘా, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని తెలిపారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఎస్ఐ జి. నీలిమ పేర్కొన్నారు.
మహిళలు, విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి