నేడు కంబాలపల్లి సతీష్కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం.
చిట్యాల: నల్లగొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా చిట్యాలకు చెందిన కంబాలపల్లి సతీష్కుమార్ యాదవ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిట్యాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సతీష్కుమార్ను శాలువాతో సన్మానించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరికంటి మొగులయ్య, పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ తదితరులు సతీష్కుమార్కు అభినందనలు తెలిపారు. యువతను పార్టీ వైపు మరింతగా ఆకర్షించి, బీజేవైఎంను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, మాస శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకుడు కన్నెబోయిన మహాలింగం, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు జయరాపు రామకృష్ణ, కూరెళ్ల శ్రీనివాస్, పల్లె వెంకన్న, కాంచర్ల శంకర్రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి